IPL-2024: ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు... టాస్ గెలిచిన కేకేఆర్

  • బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్
  • సొంతగడ్డపై విజయాన్ని కోరుకుంటున్న ఆర్సీబీ 
KKR won the toss against RCB

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా తుదిజట్టులో బౌలర్ అనుకూల్ రాయ్ కి స్థానం కల్పించారు. 

అదే సమయంలో టీమిండియా అండర్-19 ఆటగాడు అంగ్ క్రిష్ రఘువంశికి నేడు కోల్ కతా తరఫున బరిలో దిగే చాన్స్ వచ్చింది. ఈ మ్యాచ్ ద్వారా రఘువంశి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. అతడ్ని సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా ఎంపిక చేశారు. బహుశా అతడ్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దించవచ్చని తెలుస్తోంది. 

మరోవైపు బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బెంగళూరు జట్టు రెండు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లో  గెలవగా, కోల్ కతా ఒక మ్యాచ్ ఆడి అందులో విజేతగా నిలిచింది.

More Telugu News